పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత
ABN , First Publish Date - 2022-05-25T04:09:02+05:30 IST
పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత అని కావలి మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి పేర్కొన్నారు. సంయుక్త సేవాసంస్థ ఆధ్వర్యంలో మంగళవారం బాపూజీనగర్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి
కావలిటౌన్, మే 24: పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత అని కావలి మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి పేర్కొన్నారు. సంయుక్త సేవాసంస్థ ఆధ్వర్యంలో మంగళవారం బాపూజీనగర్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శివారెడ్డి, రెండవ పట్టణ సీఐ మల్లికార్జునరావు, ప్రభుత్వ వైద్యులు ప్రసాద్, రవికుమార్, డ్యానీ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంయుక్త సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జీ సురేంద్రను అభినందించారు. కార్యక్రమంలో వీ సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు వినయ్, సంస్థ ఉపాధ్యక్షులు బుర్లా రఘకుమార్రెడ్డి, నేలటూరి శివప్రసాద్రెడ్డి, అజిత్బాబు తదితరులు పాల్గొన్నారు.