ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి : సీఐ

ABN , First Publish Date - 2021-03-01T05:07:46+05:30 IST

ప్రశాంత వాతావరణంలో ఎన్నిక లు జరిగేందుకు సహకరించాలని పట్టణ సీఐ ఎంవీవీఎస్‌ఎన్‌ మూర్తి అన్నారు.

ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి : సీఐ

కొవ్వూరు ఫిబ్రవరి 28 : ప్రశాంత వాతావరణంలో ఎన్నిక లు జరిగేందుకు సహకరించాలని పట్టణ సీఐ ఎంవీవీఎస్‌ఎన్‌ మూర్తి అన్నారు. పట్టణంలోని 16వ వార్డు ఔరంగాబాద్‌లో ఆదివారం ఓటర్ల కు ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సె కండ్‌ వేవ్‌ ఉధృతి ఎక్కువగా ఉన్నందున ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు. పట్టణ ఎస్‌ఐలు కె.వెంకటరమణ, పి.రవీంద్రబాబు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T05:07:46+05:30 IST