కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-12-04T05:06:37+05:30 IST
దీర్ఘకాలికంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రొద్దుటూరు, డిసెంబరు 3 : దీర్ఘకాలికంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట గురువారం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయకుమార్ మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని ముఖ్యమంత్రి హమీ ఇచ్చారన్నారు. ఆ హామీ మేరకు తక్షణమే మున్సిపల్ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండు చేశారు. మున్సిపల్ కార్మికులందరిని సచివాలయం బదలాయింపును ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ పట్టణ కార్యదర్శి సాల్మన్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమణమ్మ, ఉపాధ్యక్షురాలు గుర్రమ్మ, కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు.