కొత్త పీఆర్‌సీ జీవో రద్దు కోసం ఆందోళనలకు సిద్ధం

ABN , First Publish Date - 2022-01-28T04:59:43+05:30 IST

పీఆర్‌సీ సాధన ఉద్యమంలో తాము పాలుపంచుకోవాలని సూళ్లూరుపేట మున్సిపల్‌ కార్మికులు నిర్ణయించారు.

కొత్త పీఆర్‌సీ జీవో రద్దు కోసం ఆందోళనలకు సిద్ధం
అంబేద్కర్‌ విగ్రహం వద్ద నినాదాలు చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

 సమావేశంలో మున్సిపల్‌ కార్మికుల నిర్ణయం

సూళ్లూరుపేట, జనవరి 27 : పీఆర్‌సీ సాధన ఉద్యమంలో తాము పాలుపంచుకోవాలని సూళ్లూరుపేట మున్సిపల్‌ కార్మికులు నిర్ణయించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో  వారు సమావేశమై శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. 31న చలో విజయవాడలో పాల్గొనాలని తీర్మానించారు. ఫిబ్రవరి  ఒకటో తేదీ నుంచి రిలే నిరాహారదీక్షలు చేపట్టాలని, 7 నుంచి నిరవధిక సమ్మెలో దిగాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం ప్రభుత్వ కొత్త పీఆర్‌సీ జీవోను రద్దుచేయాలని నినాదాలు చేస్తూ ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ర్యాలీ చేశారు. అక్కడి అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు సాంబశివయ్య, సుధాకర్‌రావు, సీపీఎం నేతలు పద్మనాభయ్య, మున్సిపల్‌ కార్మికనేతలు చెంగయ్య, వెంకటరత్నం, బాబు, పళణి, చెంగమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T04:59:43+05:30 IST