పెళ్లయిన ఏడో రోజే ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను పట్టుకున్న పోలీసులు.. ఇదేంటని భర్త నిలదీస్తే ఆమె రెస్పాన్స్ ఇదీ..

ABN , First Publish Date - 2022-06-26T02:17:30+05:30 IST

పెళ్లయిన ఏడో రోజే భర్తను వదిలేసి అతడి ఎదురుగానే ప్రియుడితో పారిపోయిన మహిళను పోలీసులు పట్టుకున్నారు.

పెళ్లయిన ఏడో రోజే ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను పట్టుకున్న పోలీసులు.. ఇదేంటని భర్త నిలదీస్తే ఆమె రెస్పాన్స్ ఇదీ..

పెళ్లయిన ఏడో రోజే భర్తను వదిలేసి అతడి ఎదురుగానే ప్రియుడితో పారిపోయిన మహిళను పోలీసులు పట్టుకున్నారు. ప్రియుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల ముందు ఆ యువతి చెప్పిన మాటలు కుటుంబ సభ్యులకు షాక్ కలిగించాయి. బీహార్ రాష్ట్రం ముంగేరు పరిధిలో నివాసం ఉంటున్న వివేక్ అనే యువకుడికి, మోనితో జూన్‌ 14న వివాహమైంది. 18న పుట్టింటికి వెళ్లిన మోని.. 21వ తేదీన అత్తగారి ఇంటికి వెళ్లింది. గాజులు కావాలని అడగడంతో అదే రోజు రాత్రి భార్యను వివేక్ మార్కెట్‌కు తీసుకెళ్లాడు. 


ఇది కూడా చదవండి..

గాజులు కొనుక్కుంటానంటే పెళ్లయిన ఏడో రోజే మార్కెట్‌కు తీసుకెళ్లిన భర్త.. నడిరోడ్డుపై ఊహించని షాకిచ్చిన భార్య..!


భర్తతో పాటు మార్కెట్‌కు వెళ్లిన మౌని అక్కడ అతడి ఎదురుగానే ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. దీంతో వివేక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరినీ 23వ తేదీ రాత్రి బెగూసరాయ్ రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం మౌని ప్రియుడు దివ్యాంశును పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం అతడికి బెయిల్ దొరికింది. శనివారం మౌని స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేసుకున్నారు. మంచివాడో, చెడ్డవాడో తన ప్రియుడితోనే కలిసి ఉంటానని మౌని పోలీసులకు చెప్పింది. తనకు ఇంక ఎవ్వరూ అక్కర్లేదని, చావైనా, బతుకైనా అతడితోనే అని చెప్పింది. 


మౌని, దివ్యాంశు గత ఆరేళ్లుగా స్కూలు రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ 2020లో ఇళ్ల నుంచి పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఇద్దరి కుటుంబ సభ్యులు ఆ పెళ్లిని ఆమోదించలేదు. ముఖ్యంగా దివ్యాంశు తల్లిదండ్రులు మౌనిని తమ కోడలిగా స్వీకరించలేదు. దీంతో మౌనికి ఆమె తల్లిదండ్రులు వివేక్‌తో పెళ్లి చేశారు. ఆ తర్వాత ఆమె దివ్యాంశుతో కలిసి వెళ్లిపోయింది.  

Updated Date - 2022-06-26T02:17:30+05:30 IST