JC Prabhakarreddy: తాడిపత్రిలో భూముల కబ్జాకు ఎమ్మెల్యే యత్నం: జేసీ ప్రభాకర్
ABN , First Publish Date - 2022-07-29T20:03:49+05:30 IST
ప్రభుత్వ భూములను తాడిపత్రి ఎమ్మెల్యే, బంధువులు కబ్జాకు యత్నిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
అనంతపురం: ప్రభుత్వ భూములను తాడిపత్రి ఎమ్మెల్యే(Tadipatri MLA), బంధువులు కబ్జాకు యత్నిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar reddy) ఆరోపించారు. శుక్రవారం తాడిపత్రిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంపై జాయింట్ కలెక్టర్ను జేసీ కలిశారు. అనంతరం జేసీ ప్రభాకర్ మాట్లాడుతూ... ల్యాండ్ డీలింగ్ చేయడమే రాజకీయ నాయకులు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రూ.60 కోట్ల విలువ చేసే ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే బంధువు కబ్జా చేస్తున్నారని అన్నారు. కబ్జా ల్యాండ్లో నిర్మాణాలు చేపట్టినా వదిలేది లేదన్నారు. టీడీపీ వచ్చాక వాటన్నిటినీ కూల్చేస్తామని... ఇప్పుడు కబ్జాకు సపోర్ట్ చేస్తున్న పోలీసులే అప్పుడు కూల్చుతారని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.