కోరుట్ల మున్సిపల్ కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు
ABN , First Publish Date - 2022-10-02T05:17:23+05:30 IST
కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు కోరుట్ల మున్సిపల్ ఎంపిక కాగా అవార్డును బల్దియా చెర్పర్సన్ అన్నం లావణ్య- అనిల్ ఢిల్లీలో శనివారం అందుకున్నారు.
కోరుట్ల, అక్టోబరు 1: కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు కోరుట్ల మున్సిపల్ ఎంపిక కాగా అవార్డును బల్దియా చెర్పర్సన్ అన్నం లావణ్య- అనిల్ ఢిల్లీలో శనివారం అందుకున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖ హౌజింగ్, అర్బన్ ఎఫెర్స్ శాఖ మంత్రి కుషాల్ కిశోర్ చేతుల మీదుగా మంత్రి కేటీఆర్ సమక్షంలో మున్సిపల్ చైర్పర్సన్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. చైర్పర్సన్ అన్నం లావణ్య ఫోన్లో విలేకర్లతో మాట్లాడారు. అవార్డు ఎంపికకు సహకా రం అందించిన కోరుట్ల పట్టణ ప్రజలు, కలెక్టర్ రవి, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మంత్రి కేటీఆర్, పాలకవర్గసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.