కోరుట్ల మున్సిపల్ కు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-10-02T05:17:23+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు కోరుట్ల మున్సిపల్‌ ఎంపిక కాగా అవార్డును బల్దియా చెర్‌పర్సన్‌ అన్నం లావణ్య- అనిల్‌ ఢిల్లీలో శనివారం అందుకున్నారు.

కోరుట్ల మున్సిపల్ కు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు
అవార్డు అందుకుంటున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నం లావణ్య

కోరుట్ల, అక్టోబరు 1: కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు కోరుట్ల మున్సిపల్‌ ఎంపిక కాగా అవార్డును బల్దియా చెర్‌పర్సన్‌ అన్నం లావణ్య- అనిల్‌ ఢిల్లీలో శనివారం అందుకున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖ హౌజింగ్‌, అర్బన్‌ ఎఫెర్స్‌ శాఖ మంత్రి కుషాల్‌ కిశోర్‌ చేతుల మీదుగా మంత్రి కేటీఆర్‌ సమక్షంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. చైర్‌పర్సన్‌ అన్నం లావణ్య ఫోన్‌లో విలేకర్లతో మాట్లాడారు. అవార్డు ఎంపికకు సహకా రం అందించిన కోరుట్ల పట్టణ ప్రజలు, కలెక్టర్‌ రవి, ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు, మంత్రి కేటీఆర్‌, పాలకవర్గసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.  

Updated Date - 2022-10-02T05:17:23+05:30 IST