APలో మున్సిపల్ పాఠశాలలు విద్యాశాఖకు అప్పగింత

ABN , First Publish Date - 2022-06-24T19:46:38+05:30 IST

రాష్ట్రంలో మున్సిపల్ పాఠశాలలను విద్యాశాఖకు అప్పగిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

APలో మున్సిపల్ పాఠశాలలు విద్యాశాఖకు అప్పగింత

అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ పాఠశాలలను విద్యాశాఖకు అప్పగిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2,114 పాఠశాలలను విద్యాశాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు మున్సిపల్ స్కూళ్లు విద్యాశాఖకు బదిలీ అయ్యాయి. టీచర్ల పదోన్నతుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా, మండల పరిషత్ స్కూళ్ల విధానాలే అమలు కానున్నట్లు వెల్లడించింది. మున్సిపల్ పాఠశాలల ఆస్తులు మున్సిపల్ శాఖ ఆధీనంలోనే కొనసాగుతాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. 

Updated Date - 2022-06-24T19:46:38+05:30 IST