Visakha: CITU ఆధ్వర్యంలో Municipal workers ధర్నా

ABN , First Publish Date - 2022-07-13T18:33:07+05:30 IST

ఏపీలోని మున్సిపల్ కార్మికులు మూడో రోజు బుధవారం సమ్మె కొనసాగిస్తున్నారు.

Visakha: CITU ఆధ్వర్యంలో Municipal workers ధర్నా

విశాఖ (Visakha): తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ (AP)లోని మున్సిపల్ కార్మికులు (Municipal workers) మూడో రోజు బుధవారం సమ్మె (strike) కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో కార్మకులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. ఈ రోజు విశాఖలోని వేపగుంట డంపింగ్ యార్డ్ ముందు సీఐటీయు (CITU) ఆధ్వర్యంలో కార్మికులు (workers) ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయు నేత వెంకట రెడ్డి (Venkata Reddy) మాట్లాడుతూ.. పారిశుద్ధ కార్మికులు మూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్మికులకు జీతాలు పెంచకుండా... తగ్గించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఘోరం ఎక్కడైనా ఉందా? అన్నారు. ఈ నెల 14 నుంచి వాటర్ సప్లై కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాడుతామని వెంకట రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-13T18:33:07+05:30 IST