మున్సిపల్‌ కార్మికుల ధర్నా

ABN , First Publish Date - 2022-01-25T03:49:26+05:30 IST

సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం మున్సిపల్‌ కార్మికులు ఏఐటీయూసీ ఆద్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

మున్సిపల్‌ కార్మికుల ధర్నా
ధర్నా చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

వెంకటగిరి, జనవరి 24:  సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం మున్సిపల్‌ కార్మికులు ఏఐటీయూసీ ఆద్వర్యంలో  మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్‌ మాట్లాడుతూ సమాన పనికి సమానవేతనం, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్‌ చేయడం తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం మేనేజర్‌ శారదాదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీహెచ్‌ బాలాజీ, చంద్రశేఖర్‌, చలపతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T03:49:26+05:30 IST