విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తా..
ABN , First Publish Date - 2021-08-03T06:01:26+05:30 IST
విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తా..
వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన ముంతాజ్ పఠాన్
పెనమలూరు/ విజయవాడ సిటీ, ఆగస్టు 2 : విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి సీఎం జగన్ రూ.37 కోట్లు మంజూరు చేశారని, ఈ ఏడాది ఉపకరణాలతో పాటు రూ.16.5 కోట్లతో 1,750 మందికి మూడు చక్రాల మోటరైజ్డ్ స్కూటర్లు పంపిణీ చేయనున్నట్టు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్పర్సన్ ముంతాజ్ పఠాన్ పేర్కొన్నారు. కానూరు అశోక్నగర్లోని సంస్థ కార్యాలయంలో సోమవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ కుమార్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, సంస్థ జనరల్ మేనేజర్ కె.వెంకటరత్నం, వైసీపీ నేత బొప్పన భవకుమార్ పాల్గొన్నారు.