MLA Rajagopal reddyతో కాంగ్రెస్ నేతల చర్చలు విఫలం
ABN , First Publish Date - 2022-07-30T18:06:45+05:30 IST
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ నేతల చర్చలు విఫలమయ్యాయి.
హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy)తో కాంగ్రెస్ నేతల(Congress leaders) చర్చలు విఫలమయ్యాయి. ఏఐసీసీ దూతలుగా రాజగోపాల్తో కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar reddy), ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి (Vamshi chand reddy) భేటీ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul gandhi) మాటగా ఢిల్లీ రావాలని కాంగ్రెస్ నేతలు కోరారు. అయితే ఉత్తమ్ విజ్ఞప్తిని రాజగోపాల్రెడ్డి తోసిపుచ్చారు. దీంతో ఏఐసీసీ దూతలు నిరాశగా వెనుదిరిగారు. కాగా... మునుగోడులో ఉపఎన్నిక ఖాయమని... కేసీఆర్ (KCR)పై ధర్మయుద్ధం చేస్తానని రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు.