Gutta Sukender Reddy: మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం
ABN , First Publish Date - 2022-08-24T19:44:34+05:30 IST
నల్గొండ (Nallagonda): మునుగోడు ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ...
నల్గొండ (Nallagonda): మునుగోడు (Munugode) ఉపఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మునగడం ఖాయమని టీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి (Trs Senior Leader Gutta Sukender Reddy) అన్నారు. రాజగోపాల్తో పాటు అన్న వెంకట్ రెడ్డి (Venkate Reddy)ని కూడా ముంచుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. వెంకట్ రెడ్డి కాంగ్రెస్ (Congress) స్టార్ క్యాంపెయినర్గా ఉండి ప్రచారంకు వెళ్లంటే అర్థం ఏంటని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నమ్మాలని నిలదీశారు.
కాగా రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు మునుగోడుపై దృష్టి సారించాయి. ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్, బీజేపీ (Bjp), కాంగ్రెస్ (Congress) పార్టీలు బహిరంగ సభలు కూడా నిర్వహించారు. ఈ మేరకు మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల సందడి నెలకొంది. బీజేపీ నుంచే రాజగోపాల్ రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి. మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. మునుగోడులో గెలుస్తామనే ధీమాలో ఆయా పార్టీలన్నాయి.