KishanReddy: కేసీఆర్ నీకు దురద పెడితే.. నువ్వు గోక్కో
ABN , First Publish Date - 2022-08-22T01:00:24+05:30 IST
సీఎం కేసీఆర్ కు దురద పెడితే ఆయనే గోక్కోవాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి...
మునుగోడు (Munugodu): సీఎం కేసీఆర్ (Cm Kcr)కు దురద పెడితే ఆయనే గోక్కోవాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Central Minister KishanReddy) అన్నారు. అవినీతిపరులే ఈడీ (ED)కి భయపడతారని ఆయన వ్యాఖ్యానించారు. ఈడీ, సీబీఐ (Cbi) విషయంలో కేంద్రం ఎక్కడా జోక్యం చేసుకోలేదన్నారు. రాజగోపాల్రెడ్డి (RajagopalReddy) ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదులుకున్నారన్నారు. మునుగోడు పులిబిడ్డ, నల్లగొండ ముద్దుబిడ్డ రాజగోపాల్రెడ్డి అని కిషన్ రెడ్డి కొనియాడారు. కేసీఆర్ ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా బీజేపీ (Bjp)కి ఉందన్నారు. కేసీఆర్ శనివారం మునుగోడులో ఎందుకు సమావేశం పెట్టారని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం రాజగోపాల్రెడ్డి రాజీనామా చేశారని.. కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడటానికి అమిత్షా వచ్చారని కిషన్రెడ్డి తెలిపారు.