సీపీఐ జిల్లా కార్యదర్శిగా మురళి
ABN , First Publish Date - 2022-08-17T07:01:48+05:30 IST
సీపీఐ జిల్లా కార్యదర్శిగా పి.మురళి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు పి.హరినాథరెడ్డి తెలిపారు.
తిరుపతి(ఆటోనగర్), ఆగస్టు 16: సీపీఐ జిల్లా కార్యదర్శిగా పి.మురళి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు పి.హరినాథరెడ్డి తెలిపారు. తిరుపతిలో రెండ్రోజులుగా జరిగిన ప్రథమ జిల్లా మహాసభల్లో ఈ ఎన్నిక జరిగినట్లు పేర్కొన్నారు. 59 మందిని కౌన్సిల్ సభ్యులుగా ఎంపిక చేశామన్నారు. వీరిలో 16 మంది కార్యవర్గ సభ్యులు ఉన్నారన్నారు. నూతన కార్యవర్గ సభ్యులుగా ఎ.రామానాయుడు, సి.పెంచలయ్య, జె.గురవయ్య, విశ్వణాథ్, సీహెచ్ ప్రభాకర్, ఎం.రమణయ్య, పి.బాలకృష్ణ, సుధాకర రెడ్డి, ఆనంద్, నదియా, కె.రాధాకృష్ణ, కె.కుమార్ రెడ్డి, చలపతి, శశికుమార్, చిన్నిరాజ్ ఉన్నారు.