కుమార్తెను వేధిస్తున్నాడంటూ దాడి

ABN , First Publish Date - 2021-04-24T04:15:21+05:30 IST

మండలంలోని రెడ్డివారికండ్రిక గ్రామంలో కుమార్తెను ఫోన్‌లో వేధిస్తున్నాడంటూ యువకుడిపై దాడి చేసిన ఘటనలో అడ్డువచ్చిన యువకుడి మేనమామ

కుమార్తెను వేధిస్తున్నాడంటూ దాడి
మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ గంగాధరరావు, ఎస్‌ఐ హనీఫ్‌

 అడ్డువచ్చిన యువకుడి మేనమామ మృతి

చేజర్ల, ఏప్రిల్‌ 23: మండలంలోని రెడ్డివారికండ్రిక గ్రామంలో కుమార్తెను ఫోన్‌లో వేధిస్తున్నాడంటూ యువకుడిపై దాడి చేసిన ఘటనలో అడ్డువచ్చిన యువకుడి మేనమామ చిలకపాటి మల్లిఖార్జున (35) నెల్లూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ప్రకాశం జిల్లాకు చెందిన నరేష్‌ అనే యువకుడు గత కొన్ని సంవత్సరాలుగా రెడ్డివారికండ్రికలో తన మేనమామ మల్లిఖార్జున ఇంటి వద్దే ఉంటున్నాడు.  తన కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడన్న అనుమానంతో లెక్కల పెంచలరెడ్డి సోదరుడి సాయంతో గురువారం సాయంత్రం జొన్న చేలో కాపలా ఉన్న నరేష్‌పై దాడి చేశారు. అక్కడే ఉన్న మల్లిఖార్జున అడ్డుకోబోగా ఆయనపైనా దాడి చేశారు. క్షతగాత్రులను ఆత్మకూ రు వైద్యశాలకు తరలించగా పరిస్థితి విషమించడంతో నెల్లూరు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మల్లిఖార్జున మృతిచెందాడు. ఆయన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉంటూ గ్రామంలోనే వ్యవసాయం చేసేవాడని చెబుతున్నారు. ఎస్‌ఐ హనీఫ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-24T04:15:21+05:30 IST