గ్రానైట్‌ వ్యాపారి హత్య

ABN , First Publish Date - 2020-11-24T04:04:44+05:30 IST

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ గ్రానైట్‌ వ్యాపారి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో దారుణహత్యకు గురయ్యాడు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్‌ వ్యాపారి వెనిశెట్టి రంగనాథ్‌(40)గా గుర్తించారు.

గ్రానైట్‌ వ్యాపారి హత్య
ఘటన ప్రదేశంలో రంగనాథ్‌ మృతదేహం


సూర్యాపేట జిల్లా అనంతగిరిలో ఘటన

ఖమ్మానికి చెందిన వెనిశెట్టి రంగనాథ్‌గా గుర్తించిన పోలీసులు 

అనంతగిరి, నవంబరు 23 : ఖమ్మం జిల్లాకు చెందిన ఓ గ్రానైట్‌ వ్యాపారి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో దారుణహత్యకు గురయ్యాడు. కోదాడ ఇన్‌చార్జి డీఎస్పీ మోహన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం అనంతగిరి నుంచి శాంతినగర్‌ వెళ్లే మార్గంలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ నిర్వహించి, మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్‌ వ్యాపారి వెనిశెట్టి రంగనాథ్‌(40)గా గుర్తించారు. తలపై రాయితో బలంగా మోదడంతో మృతి చెందాడని భావిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. తమిళనాడు రాష్ట్రం నుంచి వ్యాపార నిమిత్తం 1987లో ఖమ్మం పట్టణానికి వచ్చిన రంగనాథ్‌ గ్రానైట్‌ వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడని ఆయన తెలిపారు. మృతిపై పలు అనుమానాలు ఉండటంతో సూర్యాపేట క్లూస్‌టీంను రంగంలోకి దించి వివరాలు సేకరించామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన అన్నారు. మృతుడు రంగనాథ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు బాలాజీ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-11-24T04:04:44+05:30 IST