భార్యపై భర్త హత్యాయత్నం

ABN , First Publish Date - 2021-04-24T05:03:32+05:30 IST

భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

భార్యపై భర్త హత్యాయత్నం

పాలకొల్లు టౌన్‌, ఏప్రిల్‌ 23 : భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని వరిధనం గ్రామానికి చెం దిన వర్ధనపు ప్రసాద్‌కు జ్యోతితో చాలాకాలం కిందట వివాహమైంది. గురు వారం రాత్రి భార్యాభర్తలు గొడవపడడంతో జ్యోతి పాలకొల్లు బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళుతుండగా రైల్వే గేటు సమీపంలో భర్త ప్రసాద్‌ అడ్డగించాడు. జేబు నుంచి చిన్న చాక్‌ తీసుకుని జ్యోతి కంఠంపైనా, చేతిపైనా దాడి చేశాడని స్థానికులు తెలిపారు. స్థానికులు ప్రసాద్‌ను అడ్డగించారు. తీవ్ర గాయాలపాలైన జ్యోతిని 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఈ మేరకు పోలీ సులు కేసు నమోదు చేశారు.


Updated Date - 2021-04-24T05:03:32+05:30 IST