చికిత్స పొందుతూ దొండపాటి శ్రీనివాస్ మృతి
ABN , First Publish Date - 2021-03-01T06:03:47+05:30 IST
కత్తిపోట్లతో తీవ్రగాయాల పాలై కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నాయకుడు దొండపాటి శ్రీనివాస్ (40) ఆదివారం మృతి చెందాడు.
కాకినాడ క్రైం, ధవళేశ్వరం, ఫిబ్రవరి 28: కత్తిపోట్లతో తీవ్రగాయాల పాలై కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నాయకుడు దొండపాటి శ్రీనివాస్ (40) ఆదివారం మృతి చెందాడు. గత నెల 22న ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాల సమీపంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద శ్రీనివాస్పై కొందరు కత్తులతో దాడిచేశారు. తీవ్రగాయాలపాలైన అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.