మరదలిపై అనుమానంతో హత్య.. ఆ తర్వాత తనే స్వయంగా..

ABN , First Publish Date - 2021-04-12T23:08:21+05:30 IST

మంజుల(19) అనే యువతిని ఆమె బంధువు భూపతి ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెపై అనుమానంతో

మరదలిపై అనుమానంతో హత్య.. ఆ తర్వాత తనే స్వయంగా..

కూకట్‌పల్లి: మరదలిపై అనుమానంతో హత్య చేశాడు ఓ బావ. కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఏవీబీ పురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మంజుల(19) అనే యువతిని ఆమె బంధువు భూపతి ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెపై అనుమానంతో తరుచూ గొడవకు దిగేవాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేరని, మాట్లాడుకుందామంటూ మంజులను భూపతి పిలిచాడు. ఇంటికి వచ్చాక ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆ ఆవేశంలో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని నీటి సంపులో పారేశాడు. అయితే, భయంతో అదే రోజు సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు. నిందితుడిని రిమాండుకు తరలించామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-04-12T23:08:21+05:30 IST