ప్రేమిస్తే.. ప్రాణం తీశారు?
ABN , First Publish Date - 2021-01-25T06:21:10+05:30 IST
ప్రేమ ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. ఓ యువతిని ప్రేమించినందుకు యువకుడిని హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యువకుడి మృతికి ప్రేమే కారణమా?
కట్టంగూరు, జనవరి 24: ప్రేమ ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. ఓ యువతిని ప్రేమించినందుకు యువకుడిని హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కట్టంగూరు గ్రామ పంచాయతీ పరిధిలోని అంబేద్కర్నగర్కు చెందిన మేకల హరికృష్ణ (23) ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 23వ తేదీ ఉద యం 11 గంటలకు బైక్పై బయటికి వెళ్లిన హరికృష్ణ సాయంత్రమైనా ఇంటికి రాలేదు. కుమారుడి మొబైల్కు తల్లి ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు హరికృష్ణ కోసం వెదికినా ఆచూకీ తెలియరాలేదు. ఆదివారం మల్లారం శివారులో కుటుంబసభ్యులు వెదుకుతుండగా ఎస్ఎల్బీసీ కెనాల్ కట్టపై బైకు, 200 మీటర్ల దూరంలో కట్ట కింద మృతదేహం, పక్కనే సెల్ఫోన్ ఉందని ఓ రైతు వారికి తెలిపాడు. ముఖంపై తీవ్రమైన గాయాలతో హరికృష్ణ మృతి చెంది ఉన్నాడు. కాగా హరికృష్ణ సూర్యాపేటకు చెందిన వేరే మతానికి చెందిన యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. ఆ యువతి ఫోన్ చేయడంతోనే ఇంటి వెళ్లి బయటికి వెళ్లి తిరిగిరాలేదని తెలుస్తోంది. హరికృష్ణ ముఖంపై బలమైన గాయాలు ఉండటంతో హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హరికృష్ణ మృతదేహాన్ని నకిరేకల్ ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. విస్రాను హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడంతో హరికృష్ణ కాల్డేటాను కూడా పరిశీలిస్తున్నట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. మృతుడి తండ్రి ఎల్లయ్య కట్టం గూరు గ్రామ పంచాయతీలో వాటర్మన్గా పనిచేస్తూ 13 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.తల్లి అంబేద్కర్నగర్లోని అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పని చేస్తోంది. హరికృష్ణకు ముగ్గురు అక్కలు, ఒక అన్న ఉన్నారు. తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.