పదేళ్ల క్రితం కనిపించకుండా పోయాడు.. ఇటీవల బయటపడిన షాకింగ్ విషయం ఏంటో తెలిస్తే..
ABN , First Publish Date - 2022-03-20T21:31:04+05:30 IST
అతను పదేళ్ల క్రితం కనిపించకుండా పోయాడు.. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది..
అతను పదేళ్ల క్రితం కనిపించకుండా పోయాడు.. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కుటుంబ సభ్యులందరూ అతడి కోసం ఎంతగానో వెతికారు.. అయినా అతని ఆచూకీ దొరకలేదు.. తప్పిపోయిన ఆ వ్యక్తి భార్య, కొడుకు ఇటీవల ఓ వ్యక్తి చేతిలో హతమయ్యారు.. అప్పుడు షాకింగ్ విషయం బయటపడింది.. నిందితుడికి, తప్పిపోయిన వ్యక్తి భార్యకు వివాహేతర సంబంధం ఉందని, పదేళ్ల క్రితం వారిద్దరూ కలిసి అతడిని చంపేశారని తేలింది.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు సమీపంలోని ఝాన్సీకి చెందిన మనోజ్ అనే వ్యక్తి భార్య గీత.. నట్వర్లాల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో నట్వర్, గీత కలిసి మనోజ్ను చంపేశారు. మృతదేహాన్ని పాతిపెట్టేశారు. అనంతరం గీత తన భర్త గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఎంత వెతికినా మనోజ్ ఆచూకీ దొరకలేదు. తాజాగా గీత, ఆమె కుమారుడు హత్యలకు గురయ్యారు. వారిద్దరినీ నట్వర్ చంపేశాడని విచారణలో తేలింది.
ఆర్థిక విషయాల్లో తలెత్తిన విభేదాల వల్లే వారిద్దరినీ చంపేశానని నట్వర్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. అంతేకాదు పదేళ్ల క్రితం తప్పిపోయినట్టు ఫిర్యాదు చేసిన మనోజ్ను తాను, గీత కలిసి చంపేశామనే విషయాన్ని బయటపెట్టాడు. దీంతో అందరూ షాకయ్యారు. నట్వర్ను అదపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు.