వాండ్రంలో గర్భిణి దారుణ హత్య
ABN , First Publish Date - 2021-04-24T05:15:28+05:30 IST
ఆరు నెలల గర్భిణి దారుణ హత్యకు గురైంది.
ఆమె రెండో భర్తపైనే పోలీసుల అనుమానం
వాండ్రం(ఉండి), ఏప్రిల్ 23 : ఆరు నెలల గర్భిణి దారుణ హత్యకు గురైంది. ఆమె రెండో భర్తే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు అను మానిస్తున్నారు. భీమవరం రూరల్ ఇన్చార్జ్ సీఐ ఆర్.విజయకుమార్, ఉండి ఎస్ఐ అప్పలరాజు తెలిపిన వివరాలివి. ఉండి మండలం వాండ్రం గ్రామానికి చెందిన కోనాల మౌనిక(21) ఆమె మొదటి భర్తతో విడాకులు తీసుకుని, భీమవరానికి చెందిన ఆదినారాయణను పెళ్లి చేసుకుంది. వీరిద్ద రూ తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మౌనికను భీమవరం లోని ఆసుపత్రికి తీసుకుని వెళ్లి వస్తూ వాండ్రం ఐస్ ఫ్యాక్టరీ వెనుకకు తీసుకువెళ్లాడు. అక్కడే మద్యం సేవించి.. ఇరువురు ఘర్షణ పడ్డారు. పెనుగులాట జరిగిన ఆనవాళ్లు ఉన్నా యి. ఆపై ఆమె మెడకు చున్నీ బిగించి, చాకుతో పీక కోసి చంపేశాడు. శుక్రవారం రాత్రి ఏడు గంటల సమ యంలో ఈ ఘటన జరిగింది. ఆదినారాయణ అక్కడి నుంచి వెళుతుండగా దారిలో తన సోదరి ఎక్కడని మౌనిక సోదరి ప్రశ్నించింది. ఐస్ ఫ్యాక్టరీ వెనుక ఉందని చెప్పడంతో విషయం వెలుగుచూసింది. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పోలీసులకు సమాచారం అందజేశారు. మౌనికకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.