కాకినాడలో దారుణ హత్య
ABN , First Publish Date - 2022-05-18T14:23:19+05:30 IST
పిఠాపురం విద్యుత్నగర్లో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాలతో అత్త రమణమ్మ(46)ను అతి కిరాతకంగా అల్లుడు
కాకినాడ: పిఠాపురం విద్యుత్నగర్లో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాలతో అత్త రమణమ్మ(46)ను అతి కిరాతకంగా అల్లుడు హత్య చేశాడు. దాడి చేస్తున్న సమయంలో అడ్డుకున్న మామ, బావమరిదిపై అల్లుడు రమేష్ కత్తితో దాడి చేశాడు. అడ్డుపడ్డవారికి తీవ్ర దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.