నగల కోసం వృద్ధురాలి హత్య

ABN , First Publish Date - 2021-03-02T05:51:38+05:30 IST

నగల కోసం వృద్ధురాలిని దారుణంగా హత్యచేసిన సంఘటన బొల్లారంలో చోటు చేసుకున్నది.

నగల కోసం వృద్ధురాలి హత్య

జిన్నారం, మార్చి 1 : నగల కోసం వృద్ధురాలిని దారుణంగా హత్యచేసిన సంఘటన బొల్లారంలో చోటు చేసుకున్నది. సీఐ ప్రశాంత్‌ వివరాల ప్రకారం బొల్లారం మల్లన్నబస్తీకి చెందిన ఉసికెబావి అంతమ్మ (65) ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మొహంపై కారం చల్లి, గొంతు నులిమి హత్యచేసి, ఒంటిపై ఉన్న బంగారు నగలు, బీరువాలోని నగదు చోరీ చేశారు. సోమవారం ఉదయం కుటుంబసభ్యులు హత్య విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని సీఐ ప్రశాంత్‌ పరిశీలించారు. కాగా మృతురాలి ఇంట్లో గతంలో పని మనిషిగా చేసిన ఓ మహిళపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇంటి ఆవరణలో గల సీసీ ఫుటేజీని పరిశీలించగా.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తున్నది. 

Updated Date - 2021-03-02T05:51:38+05:30 IST