మినపప్పు మురుకులు
ABN , First Publish Date - 2021-04-23T18:14:30+05:30 IST
మినపప్పు- పావు కిలో, బియ్యం పిండి- అర కిలో, నూనె- పావు కిలో, కారం- 3 స్పూన్లు, ఉప్పు- తగినంత, నెయ్యి- రెండు స్పూన్లు.
కావలసిన పదార్థాలు: మినపప్పు- పావు కిలో, బియ్యం పిండి- అర కిలో, నూనె- పావు కిలో, కారం- 3 స్పూన్లు, ఉప్పు- తగినంత, నెయ్యి- రెండు స్పూన్లు.
తయారుచేసే విధానం: మినపప్పు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి బియ్యం పిండి, జీలకర్ర, కారం, ఉప్పు, నెయ్యి వేసి ముద్దలా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేసి కాగాక జంతికల గొట్టంలో పిండి ముద్దను పెట్టి మురుకులు వేయాలి. దోరగా కాల్చి తీస్తే కరకరలాడే మినపప్పు మురుకులు రెడీ.