పుట్టగొడుగులతో మతిమరుపు మాయం

ABN , First Publish Date - 2020-03-16T22:29:07+05:30 IST

శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉన్నాయి. సాధారణంగా ప్రొటీన్లు అంత సులువుగా జీర్ణం కావు. 60 ఏళ్లు దాటిన వారిలో సహజంగానే మెదడు కణాలు

పుట్టగొడుగులతో మతిమరుపు మాయం

ఆంధ్రజ్యోతి(16-03-2020)

శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉన్నాయి. సాధారణంగా ప్రొటీన్లు అంత సులువుగా జీర్ణం కావు. 60 ఏళ్లు దాటిన వారిలో సహజంగానే మెదడు కణాలు క్షీణించిపోతుంటాయి. ఫలితంగా మతిమరుపు కలిగించే డిమెన్షియా వ్యాధి మొదలవుతుంది. అయితే వీరు వారానికి రెండుసార్లు, 300 గ్రాముల ఉడికించిన పుట్టగొడుగులు తీసుకున్నట్టయితే మతిమరుపు సమస్య 50 శాతం వరకు తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మెదడు కణాల క్షయం కారణంగా వృద్ధుల్లో మతిమరుపుతో పాటు భాషా సామర్థ్యం తగ్గిపోతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. అయితే పుట్టగొడుగులు ఈ లోపాల్ని చాలావరకు భర్తీ చేస్తాయంటున్నారు పరిశోధకులు. పుట్టగొడుగుల్లో ప్రత్యేకించి మన శరీరం తనకు తానుగా ఉత్పత్తి చేసుకోలేని ఒక అరుదైన అమినోయాసిడ్ ఉంటుందనీ, అది ఈ విశేష ప్రయోజనాలన్నీ కలిగిస్తుందని వారు చెబుతున్నారు.

Updated Date - 2020-03-16T22:29:07+05:30 IST