రామ మందిర నిర్మాణానికి ముస్లింల విరాళం
ABN , First Publish Date - 2021-01-17T05:53:53+05:30 IST
అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి 11వ వార్డుకు చెందిన ముస్లింలు షేక్ బాజీ, షేక్ సైదాబీ ఒక్కొక్కరు రూ.116లు విరాళాన్ని అందజేశారు.
జగ్గయ్యపేట, జనవరి 16 : అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి 11వ వార్డుకు చెందిన ముస్లింలు షేక్ బాజీ, షేక్ సైదాబీ ఒక్కొక్కరు రూ.116లు విరాళాన్ని అందజేశారు. రామమందిర నిర్మాణంలో అన్ని మతాల వారు భాగస్వామ్యులు కావటం ఆనందంగా ఉందని నగర ప్రముఖ్ ధరణికోట వెంకటరమణ అన్నారు.
వత్సవాయి : అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని మండల నిర్మాణ నిధి ట్రస్ట్ ప్రముఖ్ మన్నె శ్రీనివాసరావు కోరారు. చిట్యాల గ్రామానికి చెందిన మారెళ్ల పుల్లారెడ్డి రూ. 1,00,116 చెక్కును శనివారం అందజేశారు. ట్రస్ట్ సభ్యులు కె.ఆర్.భరద్వాజ్, అన్నెపాక ప్రపుల్ల శ్రీకాంత్, లంకెల మల్లారెడ్డి, హనుమంతరావు, నాగుల్మీరా పాల్గొన్నారు.