యూహెచ్సీలో ఉద్యోగులను కొనసాగించాలి
ABN , First Publish Date - 2021-03-01T04:58:29+05:30 IST
పట్టణ ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న ఉద్యోగులను కొన సాగించాలని పట్టణ ప్రాఽథ మిక ఆరోగ్య కేంద్రం ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గణపతి కోరారు.
విజయనగరం దాసన్నపేట, ఫిబ్రవరి 28: పట్టణ ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న ఉద్యోగులను కొన సాగించాలని పట్టణ ప్రాఽథ మిక ఆరోగ్య కేంద్రం ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గణపతి కోరారు. ఈ మేరకు ఆదివారం వైసీపీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త చిన్న శ్రీనుకు వినతిపత్రం అందించారు. జీవో నెంబరు 686 ప్రకారం రాష్ట్రంలో కొత్తగా నియామకాలు జరపాలని సర్కార్ ఆదేశాలు ఇవ్వగా, తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడున్న జనరేషన్ మెరిట్తో పోటీ పడలేమని, మిగిలిన ఖాళీలకు మాత్రమే కొత్తవారిని ఎంపిక చేయాలని తెలిపారు. తమను యథావిధిగా కొన సాగించాలని కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చిన్నశ్రీను తెలిపారు.