క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి: మంత్రి
ABN , First Publish Date - 2021-03-02T05:52:13+05:30 IST
క్రీడలపై ప్రజలు ఆసక్తిని పెంపొందించుకోవాలని మంత్రి గుంటకండ్ల జగదీ్షరెడ్డి అన్నారు. చీదేళ్ల గ్రామంలో లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి జాతర సందర్భంగా ఎడ్లపందేలను సోమవారం మంత్రి ప్రారంభించి అనంతరం మాట్లాడారు.
పెన్పహాడ్, మార్చి 1: క్రీడలపై ప్రజలు ఆసక్తిని పెంపొందించుకోవాలని మంత్రి గుంటకండ్ల జగదీ్షరెడ్డి అన్నారు. చీదేళ్ల గ్రామంలో లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి జాతర సందర్భంగా ఎడ్లపందేలను సోమవారం మంత్రి ప్రారంభించి అనంతరం మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తక్కిళ్లపెల్లి రవీందర్, జడ్పీటీసీ అనితాఅంజయ్య, మేక కృష్ణామోహన్, దేవాలయ కమిటీ చైర్మన్ గుర్రం అమృతరెడ్డి పాల్గొన్నారు.