హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి

ABN , First Publish Date - 2022-05-22T05:58:27+05:30 IST

హక్కుల సాధనకు కార్మికులు ఐక్యంగా పోరాడాలని ఏఐ టీయూసీ జిల్లా అధ్య క్షుడు గోరేటి రాములు, ప్రధాన కార్యదర్శి ఎండీ. ఇమ్రాన్‌ పిలు పునిచ్చారు.

హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి
జెండా ఎగురవేస్తున్న రాములు

మోత్కూరు, మే 21: హక్కుల సాధనకు కార్మికులు ఐక్యంగా పోరాడాలని ఏఐ టీయూసీ జిల్లా అధ్య క్షుడు గోరేటి రాములు, ప్రధాన కార్యదర్శి ఎండీ. ఇమ్రాన్‌ పిలు పునిచ్చారు. మోత్కూ రులో శనివారం ఏఐటీయూసీ మండల ద్వితీయ మహా సభలో మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులు, చట్టాలను నేటి పాలకులు తుంగలో తొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ సంస్థల కొమ్ముకాస్తూ కార్మికుల పొట్టగొడుతున్నారన్నారు. కేంద్ర ప్రభు త్వం 44కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మికులను బానిసలుగా మార్చేందుకు ప్రయత్ని స్తోందన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు భారీగా రాయితీలు ఇస్తూ, వంట గ్యాస్‌, పెట్రోల్‌, డిజిల్‌ ధరలు పెంచుతూ పేద, మధ్య తరగతి వర్గాలపై భారం మోపు తున్నారని విమర్శించారు. పురుగుల మారయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాశికంటి లక్ష్మీనర్సయ్య, అన్నెపు వెంకట్‌, పుల్కరం మల్లేష్‌, సలి గంజి వీరస్వామి, జంగ నర్సయ్య, తొంట గిరిబాబు, వెంకటయ్య పాల్గొన్నారు.


Updated Date - 2022-05-22T05:58:27+05:30 IST