చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2022-05-20T04:52:56+05:30 IST

ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని న్యాయాధికారి మహతి వైష్ణవి అన్నారు. గురువారం హాజీపూర్‌ మండలంలోని 13వ బెటాలియన్‌లో నిర్వహించిన చట్టాలపై అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. చట్టాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. సమాజంలో జరుగుతున్న నేరాలు, వాటి శిక్షల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
మాట్లాడుతున్న న్యాయాధికారి మహతి వైష్ణవి

హాజీపూర్‌, మే 19 : ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని న్యాయాధికారి మహతి వైష్ణవి అన్నారు. గురువారం హాజీపూర్‌ మండలంలోని 13వ బెటాలియన్‌లో నిర్వహించిన చట్టాలపై అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. చట్టాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. సమాజంలో జరుగుతున్న నేరాలు, వాటి శిక్షల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళల కోసం ప్రత్యేక చట్టాలున్నాయని, మహిళలు వేధింపులకు గురైనప్పుడు దైర్యంగా ఎదుర్కోవాలన్నారు.  మహిళలు చీకటి ప్రదేశాల్లో, జనసంచారం లేని చోట్ల ఉండకూదన్నారు. బెటాలియన్‌ కమాండెంట్‌ రామకృష్ణ, ఏసీపీ తిరుపతి, హాజీపూర్‌  ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌, బెటాలియన్‌ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T04:52:56+05:30 IST