ఐక్యంగా ముందుకు సాగాలి

ABN , First Publish Date - 2021-07-26T03:51:26+05:30 IST

రాష్ట్రంలో బ్రాహ్మణులు ఐక్యంగా ముందుకు సాగుతూ, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు.

ఐక్యంగా ముందుకు సాగాలి
డిప్యూటీ స్పీకర్‌ని సన్మానిస్తున్న దృశ్యం

దాసన్నపేట: రాష్ట్రంలో బ్రాహ్మణులు  ఐక్యంగా ముందుకు సాగుతూ, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని  శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.  ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. గతంలో చట్ట సభల్లో 25 మంది బ్రాహ్మణులు ఉండేవారని నేడు ఆ సంఖ్య రెండుకి పడిపోయిందన్నారు.  కరోనా కష్టకాలంలో అర్చకులు పడుతున్న ఇబ్బందులను వైఎస్‌ విజయమ్మ, సీఎం జగన్‌ గుర్తించి శాసనసభ్యులందరికీ దిశా నిర్దేశం చేశారని చెప్పారు. ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ.. సంఘం ఆధ్వర్యంలో గుర్తించిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కొన్ని ఆలయాల్లో అర్చకుల పరిస్థితిని కూడా తెలియజేస్తామన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌, ఎస్‌.దుర్గాప్రసాద్‌, మేయర్‌ విజయలక్ష్మి, కె.శ్రావణి, రాకేష్‌ శర్మ, సుమతి పాల్గొన్నారు.
  
 

Updated Date - 2021-07-26T03:51:26+05:30 IST