దృఢ సంకల్పంతో ముందుకు పోవాలి
ABN , First Publish Date - 2022-06-26T04:55:25+05:30 IST
ప్రతీ విద్యార్ధి దృఢ సంకల్పంతో ముందుకు పోవాలని గిరిజన సంక్షేమశాఖ జనరల్ మేనేజర్ సీతారాం నాయక్ అన్నారు.
గద్వాల క్రైం, జూన్ 25: ప్రతీ విద్యార్ధి దృఢ సంకల్పంతో ముందుకు పోవాలని గిరిజన సంక్షేమశాఖ జనరల్ మేనేజర్ సీతారాం నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న గ్రూప్స్ శిక్షణ శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సౌకర్యాలు, విద్యాబోధన తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి అభ్యర్థులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్, నిర్వహణ కో-ఆర్డినేటర్ పవన్కుమార్ తదితరులున్నారు.