ఉద్యోగ సాధనకు శ్రమించాలి

ABN , First Publish Date - 2021-05-10T04:53:01+05:30 IST

ఉద్యోగ సాధనకు శ్రమించాలి

ఉద్యోగ సాధనకు శ్రమించాలి
యువతికి స్టడీ మెటీరియల్‌ అందజేస్తున్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే యువత అకుంఠిత దీక్షతో శ్రమించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. పోలీస్‌ ఉద్యోగాల కోసం ఎంకేఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా శిక్షణ పొందుతున్న మహిళా అభ్యర్థుల కు ఆదివారం ఇబ్రహీంపట్నంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో స్టడీ మెటీరియల్‌ ప ంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ ప్రభుత్వ ఉద్యోగార్థుల కోసం తమ ఫౌండేషన్‌ ద్వారా శిక్షణ ఇచ్చే ందుకు కార్యాచరణ రూపొందించిన ట్లు చెప్పారు. అభ్యర్థులు ఇంటివద్దే చదువుకోవడానికి స్టడీ మెటీరియల్‌ ను తయారుచేశామన్నారు. ఉచిత శిక్షణకు 704మంది అభ్యర్థులు ఎం పికకాగా వారితోపాటు మిగిలిన అ భ్యర్థులకు అందుబాటులో ఉండే వి ధంగా పంచాయతీ కార్యాలయాల్లో స్టడీ మెటీరియల్‌ ఉ ంచుతున్నామని తెలిపారు. అభ్యర్థులు ఈ నాలుగు నెల లు ఉద్యోగ సాధనే లక్ష్యంగా చదవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, ఫౌండేషన్‌ కార్యదర్శి రాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T04:53:01+05:30 IST