మన్యంలో ముసురు

ABN , First Publish Date - 2020-11-27T05:58:14+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి ఏజెన్సీ వ్యాప్తంగా జల్లులతో కూడిన వర్షం కురుస్తున్నది. దీంతో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మన్యంలో ముసురు
ఈదురు గాలులకు రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్టుకొమ్మ.


పాడేరు, నవంబరు 26: నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి ఏజెన్సీ వ్యాప్తంగా జల్లులతో కూడిన వర్షం కురుస్తున్నది. దీంతో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం భారీగా లేనప్పటికీ కోతలు జరుగుతున్న వరి, రాగులు, సామ పంటలకు నష్టం వాటిల్లుతుందని గిరి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే కోతలు పూర్తయిన చాలా వరకు పంటలను కుప్పలు వేయగా, అక్కడక్కడ కోసిన వరి పనలు పొలాల్లోనే ఉన్నాయి. దీంతో వర్షం భారీగా కురిస్తే ధాన్యం పాడవుతాయని రైతులు అంటున్నారు. మరో రెండు రోజులు కొనసాగితే ఇబ్బందులు తప్పవని రైతులు అంటున్నారు. సీలేరు ధారాలమ్మ ఘాట్‌ రోడ్డుపై గురువారం సాయంత్రం పెద్ద చెట్టు పడింది. దీంతో పెద్ద వాహనాల రాకపోకలకు అంతరాయంగా మారింది. 

Updated Date - 2020-11-27T05:58:14+05:30 IST