బీజేపీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడిగా మువ్వల వెంకటరమణారావు
ABN , First Publish Date - 2021-12-06T05:19:26+05:30 IST
బీజేపీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా చీరాలకు చెందిన మువ్వల వెంకటరమణారావు నియమితులయ్యారు.
ఒంగోలు(కలెక్టరేట్), డిసెంబరు 5 : బీజేపీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా చీరాలకు చెందిన మువ్వల వెంకటరమణారావు నియమితులయ్యారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేవ్వరి ఆయనకు నియామకపత్రాన్ని అం దజేశారు. ఈ సందర్భంగా మువ్వల మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.