యూపీలో most polluted cityగా ముజఫ్పర్‌నగర్

ABN , First Publish Date - 2021-11-27T18:14:50+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక వాయు కాలుష్యనగరంగా ముజఫ్ఫర్ నగర్ నిలిచింది....

యూపీలో most polluted cityగా ముజఫ్పర్‌నగర్

ముజప్ఫర్‌నగర్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక వాయు కాలుష్యనగరంగా ముజఫ్ఫర్ నగర్ నిలిచింది.ఈ శీతాకాలంలో ముజప్ఫర్‌నగర్‌లో వాయునాణ్యత సూచిక అత్యధికంగా 423 ఏక్యూఐగా నిలిచింది.వాయు కాలుష్యం వల్ల ముజప్ఫర్‌నగర్ వాసులు తీవ్ర శ్వాసకోస ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.యూపీ రాష్ట్రంలోని నోయిడా, హాపూర్, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, మీరట్, బులంద్ షహర్,బాగ్ పత్ నగరాల్లో వాయు కాలుష్యం అధికంగా ఉంది.మీరట్ నగరంలో ఏక్యూఐ 373గా నమోదైంది. దీంతో ఉత్తరప్రదేశ్‌లో మీరట్ నగరం వాయు కాలుష్య ర్యాంకింగ్‌లో ఆరో స్థానంలో నిలిచింది. ఢిల్లీ నగరం కంటే ముజఫ్ఫర్ నగర్, మీరట్ నగరాల్లో వాయు కాలుష్యం అధికంగా ఉన్నా దీని నివారణకు మాత్రం అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదు.  


Updated Date - 2021-11-27T18:14:50+05:30 IST