టాటా గ్రూప్‌లో... నా ఓటు దానికే...

ABN , First Publish Date - 2021-06-22T23:57:43+05:30 IST

టాటా కమ్యూనికేషన్స్ షేరు ధర ఏడాది క్రితం రూ. 400. ఇప్పుడు రూ. 1,300. అయినా కూడా ఈ స్టాక్‌పై అంచనాలు కంటిన్యూ అవుతున్నాయి.

టాటా గ్రూప్‌లో...  నా ఓటు దానికే...

ముంబై : టాటా కమ్యూనికేషన్స్ షేరు ధర  ఏడాది క్రితం రూ. 400. ఇప్పుడు రూ. 1,300. అయినా కూడా ఈ స్టాక్‌పై అంచనాలు కంటిన్యూ అవుతున్నాయి.  ఈ క్రమంలో కొన్ని వివరాలిలా ఉన్నాయి. ఈక్విటీ ఇంటలిజెన్స్ ఇండియా అధినేత పొరింజు వేలియాత్... దక్షిణాదిన ఏస్ ఇన్వెస్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన పోర్ట్‌ఫోలియోలో టీసీఎస్, టాటాఎలక్సీ కంటే టాటా కమ్యూనికేషన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే... డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో టాటా ఎలక్సి కానీ ఇంకో కంపెనీ కానీ వేల్యేషన్ , మార్కెట్ కేపిటలైజేషన్ పరంగా అభివృద్ధి చెందాయని చెబుతుంటారు. 


కాగా... టాటా కమ్యూనికేషన్స్‌ మాత్రం నిరుడు  మార్చిలో రూ. 200 కు కూడా పతనమైన విషయం తెలిసిందే. అప్పటినుంచి తమ పోర్ట్‌ఫోలియోలో టాటా కమ్యూనికేషన్స్‌కి చోటు ఇచ్చిన పొరింజు వేలియాత్... ఈ స్టాక్‌లో మొమెంటమ్ ఇంకా ఉందంటారు. నాలుగు అంకెల సంఖ్యకి చేరిన టాటా కమ్యూనికేషన్స్ మార్కెట్ కేపిటలైజేషన్ ప్రస్తుతం రూ. 3 5వేల కోట్లకు చేరుకుంది. ఇప్పటికీ టాటా కమ్యూనికేషన్స్ షేరు అండర్ ప్రైస్‌లోనే ఉందని పొరింజు వేలియాత్ ఘంటాపథంగా చెబుతుండడం గమనార్హం. 

Updated Date - 2021-06-22T23:57:43+05:30 IST