మైలాన్ ఫార్మా రెమ్డిసివిర్ జనరిక్ వెర్షన్ ధర తెలిసింది..!
ABN , First Publish Date - 2020-07-07T05:53:07+05:30 IST
రోనాకు అత్యవసర మందుగా ప్రముఖ ఫార్మా సంస్థ మైలాన్ తీసుకొస్తున్న రెమ్డిసివిర్ జనరిక్ వెర్షన్ ధరను...
కరోనాకు అత్యవసర మందుగా ప్రముఖ ఫార్మా సంస్థ మైలాన్ తీసుకొస్తున్న రెమ్డిసివిర్ జనరిక్ వెర్షన్ ధరను ఆ సంస్థ నిర్ణయించింది. 100 ఎంజీ వయల్(ఇంజక్షన్) ధర 4,800 రూపాయలుగా సంస్థ ప్రకటించింది. డెస్రెమ్ పేరుతో ఈ వయల్ అందుబాటులోకి రానుంది. ఈ నెలలోనే భారత్లో విక్రయాలు ప్రారంభించనున్నట్లు మైలాన్ ఫార్మా స్పష్టం చేసింది. డెస్రెమ్కు డీసీజీఐ నుంచి అనుమతి కూడా లభించిందని పేర్కొంది.
భారత్లో కోవిడ్-19 బాధితులకు చికిత్సలో భాగంగా.. ప్రస్తుతం హైడ్రాక్సీ క్లోరోక్వీన్తో పాటు కొన్ని యాంటీ వైరల్ మందులు కూడా ఇస్తున్నారు. ఆ యాంటీ వైరల్ మందుల్లో రెమ్డిసివిర్ ఒకటి. ఇప్పటికే రెమ్డిసివిర్ జనరిక్ వెర్షన్ను సిప్లా ‘సిప్రెమి’ పేరుతో, హెటిరో ‘కోవిఫర్’ పేరుతో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ‘సిప్రెమి’ ధర రూ.5000 కాగా, ‘కోవిఫర్’ ధర రూ.5,400.