Mysore Palace: 4 వరకు మైసూరు ప్యాలెస్ వీక్షణకు అవకాశం
ABN , First Publish Date - 2022-09-30T16:56:03+05:30 IST
మైసూరు దసరా ఉత్సవాల(Mysore Dussehra Festivals) ప్రత్యేక దీపాలంకరణను అక్టోబరు 4వరకు వీక్షించే అవకాశాన్ని పర్యాటకులకు
బెంగళూరు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మైసూరు దసరా ఉత్సవాల(Mysore Dussehra Festivals) ప్రత్యేక దీపాలంకరణను అక్టోబరు 4వరకు వీక్షించే అవకాశాన్ని పర్యాటకులకు కల్పిస్తున్నారు. మైసూరు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ చంద్రగుప్త(Dr. Chandragupta) గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజూ రాత్రి 9 గంటల నుంచి 11వరకు మైసూరులోని పర్యాటక కేంద్రాల్లో వాహనాల సంచారంపై నిషేధం విధిస్తున్నామన్నారు. పర్యాటకులు పెద్దసంఖ్యలో చారిత్రాత్మక కట్టడాల దీపాలంకరణను వీక్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. హార్డింజ్ సర్కిల్, చామరాజ సర్కిల్, కృష్ణరాజ సర్కిల్, సయ్యాజిరావ్ రోడ్డు, మహారాజ సంస్కృత పాఠశాల సర్కిల్, గన్హౌ్స సర్కిల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని చారిత్రాత్మక కట్టడాలు, విద్యుద్దీపాలతో ధగధగ మెరుస్తూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రాత్రిపూట రాచనగరి మైసూరు అందాలను వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.