Jp nadda : కాంగ్రెస్‌కు మిషన్ లేదు... కేవలం కమీషనే

ABN , First Publish Date - 2021-07-27T03:36:31+05:30 IST

కాంగ్రెస్‌కు మిషన్ లేదని, కేవలం కమీషన్లు తీసుకోవడం మాత్రమే తెలుసని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా మండిపడ్డారు

Jp nadda : కాంగ్రెస్‌కు మిషన్ లేదు... కేవలం కమీషనే

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌కు మిషన్ లేదని, కేవలం కమీషన్లు తీసుకోవడం మాత్రమే తెలుసని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా మండిపడ్డారు. కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకొని ఆయన ప్రసంగించారు. దేశ రక్షణ విషయంలో మోదీ సర్కార్ నిక్కచ్చిగా ఉంటూ, దేశ ప్రయోజనాలను కాపాడుతూ వస్తోందని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండా ఉండడమే అత్యుత్తమ నిర్ణయంగా భావించారని ఎద్దేవా చేశారు. దేశ మిలటరీ వ్యవస్థను ఆధునీకరించడంలో మెరుపు వేగంతో పయనిస్తున్నామని, కానీ కాంగ్రెస్ హయాంలో ఆధునికీకరణ కుంటు పడిందని విమర్శించారు. జాతీయవాదానికి తాము అసలు సిసలైన ప్రతిరూపాలమని జేపీ నడ్డా అన్నారు. 

Updated Date - 2021-07-27T03:36:31+05:30 IST