భర్త మృతి తట్టుకోలేక భార్య ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-07T05:49:27+05:30 IST
కరోనాతో భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గణపవరం గ్రామంలో గురువారం జరిగింది
నాదెండ్ల, మే 6: కరోనాతో భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గణపవరం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం బొల్లాపల్లి మండలం రేమిడిచర్లకు చెందిన కలవల వెంకటేశ్వర్లు(53) గణపవరంలో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య భాగ్యలక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం వెంకటేశ్వర్లుకు కరోనా సోకడంతో నరసరావుపేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 1వ తేదీన మృతి చెందాడు. భార్యతోపాటు పిల్లలకు కరోనా సోకడంతో వివిధ ఆసుపత్రులలో చికిత్సకు చేరారు. భార్య భాగ్యలక్ష్మి(46)కి నెగిటివ్ రావడంతో బుధవారం ఇంటికి వచ్చింది. భర్త మరణం సమాచారం తెలుసుకున్న ఆమె జీర్ణించుకోలేక ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలిద్దరూ చిలకలూరిపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.