ప్రజల సమస్యలు చూస్తే బాధేస్తుంది.. Nadendla Manohar
ABN , First Publish Date - 2022-06-05T23:22:26+05:30 IST
Guntur: రాష్ట్రంలో ప్రజల సమస్యలు చూస్తే బాధేస్తుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లోపించిందని, ముఖ్యమంత్రి
Guntur: రాష్ట్రంలో ప్రజల సమస్యలు చూస్తే బాధేస్తుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లోపించిందని, ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కడం, ప్రకటనలు ఇవ్వడానికి మాత్రమే పరిమితమయ్యారని ఆరోపించారు. సంక్షేమం కోసమే అప్పులు తీసుకొస్తున్నామని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరారు. జగన్ అధికారంలోకి వచ్చాక 132 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, పులివెందులలోనే 13 మంది బలవన్మరణానికి పూనుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉందన్నారు.