పవన్ సాయం చేసింది వారికి కాదా?: nadendla manohar
ABN , First Publish Date - 2022-05-16T23:53:03+05:30 IST
పవన్ సాయం చేసింది వారికి కాదా?: nadendla manohar
అమరావతి: రైతులను మోసం చేయడంలో జగన్ను మించినవారుండరని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. పవన్ సాయం చేసింది కౌలు రైతులకు కాదా?, కౌలు రైతులకు జనసేన సాయం చేయలేదని జగన్ చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. కౌలుకు తీసుకుని అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారని, పోలీస్ రికార్డుల్లో వివరాలు చూపిస్తామన్నారు. సీబీఐ దత్తపుత్రుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? అని ప్రశ్నించారు. రైతులను కులాలవారీగా విభజించిన ప్రభుత్వమిదేనన్నారు. సీబీఐ దత్తపుత్రుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. సాయాన్ని కూడా రాజకీయంగా చూడటానికి సిగ్గుండాలన్నారు.