పాలనా దక్షతలేని వ్యక్తి Jagan: నాదేండ్ల మనోహర్

ABN , First Publish Date - 2022-05-06T19:25:17+05:30 IST

జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, పాలనా దక్షతలేని వ్యక్తి జగన్ అని నాదేండ్ల మనోహర్ విమర్శించారు.

పాలనా దక్షతలేని వ్యక్తి Jagan: నాదేండ్ల మనోహర్

Kurnool: జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, పాలనా దక్షతలేని వ్యక్తి జగన్ అని జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ కుటుంబం కోసం, వైసీపీ కోసం రాష్ట్రాన్ని అంథకారంలోకి నెట్టేశారని ఆరోపించారు. ఈ నెల 8న సిరువెళ్లలో రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కర్నూలు జిల్లాలో 400 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బలమైన రాజకీయ శక్తిగా జనసేన ఎదుగుతోందన్నారు. జనసేన చేస్తున్న కార్యక్రామలు ఏ రాజకీయ పార్టీ కూడా చేయడం లేదన్నారు. ఏపీ గురించి, రోడ్లు, కరెంటు గురించి పక్క రాష్ట్రాలు మాట్లాడుకునే దౌర్భాగ్య పరిస్థితి జగన్ తీసుకొచ్చారని నాదేండ్ల మనోహర్ మండిపడ్డారు.

Read more