Pawan Yatra.. అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ యాత్ర: నాదెండ్ల మనోహర్

ABN , First Publish Date - 2022-08-14T19:04:17+05:30 IST

జనసేన నిర్వహించిన ఐటీ (IT) సమ్మిట్‌లో 600 మంది నిపుణులు పాల్గొన్నారని నాడేండ్ల తెలిపారు.

Pawan Yatra.. అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ యాత్ర: నాదెండ్ల మనోహర్

అమరావతి (Amaravathi): జనసేన నిర్వహించిన ఐటీ (IT) సమ్మిట్‌లో 600 మంది నిపుణులు పాల్గొన్నారని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని క్రియాశీల కార్యకర్తల నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేసే విభాగాల్లో ఐటీ వింగ్ కీలకమని తెలిపారు. ఐటీ వింగ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరే విధంగా పనిచేయాలని సూచించారు. ఈరోజు రాజకీయాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అక్టోబర్ 5 నుంచి  యాత్ర ప్రారంభిస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా పవన్ పర్యటనలు ఉంటాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Updated Date - 2022-08-14T19:04:17+05:30 IST