అనుమానాస్పద స్థితిలో ఒడిశా యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-12-05T05:56:16+05:30 IST
గణపవరం గ్రామంలోని సినిమాహాలు సెంటర్లో నివాసముంటున్న రమేష్ మాలిక్(30) అనే ఒడిశాకు చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో శనివారం ఉదయం మృతిచెందాడు.
గణపవరం(నాదెండ్ల), డిసెంబరు 4: గణపవరం గ్రామంలోని సినిమాహాలు సెంటర్లో నివాసముంటున్న రమేష్ మాలిక్(30) అనే ఒడిశాకు చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో శనివారం ఉదయం మృతిచెందాడు. ఒడిశా రాష్ట్రం భద్ర జిల్లా సనద్పూర్కు చెందిన రమేష్మాలిక్, సర్వేశ్వరమాలిక్ ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. వీరిద్దరూ ఆయా కంపెనీలలో కార్మికులుగా పనిచేస్తున్నారు. రమేష్మాలిక్ శనివారం ఉదయం అస్వస్థతకు గురికాగా సర్వేశ్వరమాలిక్ ట్యాబ్లెట్ వేశాడు. కొద్దిసేపటికే రమేష్మాలిక్ కుప్పకూలి మృతి చెందాడు. దీంతో భయపడిన సర్వేశ్వరమాలిక్ మృతదేహాన్ని గది బయట ఉంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నాదెండ్ల పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.