కుడి జలవిద్యుత్‌ కేంద్రం సందర్శించిన సీఈ

ABN , First Publish Date - 2021-07-24T05:00:41+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ కుడి జలవిద్యుత్‌ కేంద్రాన్ని ఓఅండ్‌ఎం చీఫ్‌ ఇంజనీర్‌ కె.సుధీర్‌బాబు శుక్రవారం సందర్శించారు.

కుడి జలవిద్యుత్‌ కేంద్రం సందర్శించిన సీఈ
టెయిల్‌పాండ్‌ డ్యాంను పరిశీలిస్తున్న చీఫ్‌ ఇంజనీర్‌ సుధీర్‌బాబు

విజయపురిసౌత్‌, రెంటచింతల, జూలై 23: నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ కుడి జలవిద్యుత్‌ కేంద్రాన్ని ఓఅండ్‌ఎం చీఫ్‌ ఇంజనీర్‌ కె.సుధీర్‌బాబు శుక్రవారం సందర్శించారు. ఆయన శ్రీశైలం, సాగర్‌ కుడి జలవిద్యుత్‌ కేంద్రం, టెయిల్‌పాండ్‌లకు ఓఅండ్‌ఎం సీఈగా ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కుడి జలవిద్యుత్‌ కేంద్రంలోని టర్బయిన్‌, స్విచ్‌యార్డు, ట్రాన్స్‌ఫార్మర్స్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఈ వైఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా సత్రశాలలోని  నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టును పరిశీలించారు. యూనిట్‌ 2కు సంబంధించి పలు సూచనలు చేశారు. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బందితో మాట్లాడారు. డీఈలు రామకృష్ణ, శ్రీకాంత్‌, ఏడీఈలు బోడయ్య, అంకన్న, వెంకట్రామిరెడ్డి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయనను యూనియన్ల నాయకులను ఆయనను సత్కరించారు. 

 


Updated Date - 2021-07-24T05:00:41+05:30 IST