వేమూరులో ఇసుక డంపింగ్ యార్డులపై నక్కా ఆనంద్ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-06-15T18:00:02+05:30 IST

వేమూరు నియోజకవర్గంలో ఇసుక డంపింగ్ యార్డుల ఏర్పాట్లపై మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేమూరులో ఇసుక డంపింగ్ యార్డులపై నక్కా ఆనంద్ ఆగ్రహం

గుంటూరు: వేమూరు నియోజకవర్గంలో ఇసుక డంపింగ్ యార్డుల ఏర్పాట్లపై మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లూరు మండలం దోనేపూడిలో హైస్కూల్ గ్రౌండ్‌ను డంపింగ్ మార్చే ప్రయత్నం మానుకోవాలన్నారు. గ్రౌండ్ కోసం మాట్లాడిన యువతపై కేసులు పెడతామని బెదిస్తున్నారని... జేపీ కంపెనీ సొంతంగా స్థలాలు చూసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ స్థలాలను జేపీ కంపెనీ ఎలా వాడుకుంటుందని ప్రశ్నించారు. ఇప్పటికే వేమూరు మార్కెట్ యార్డ్‌ను డంపింగ్ యార్డ్‌గా మార్చారన్నారు. రైతుల కోసం నిర్మించిన మార్కెట్ యార్డును ఇసుక డంపింగ్ యార్డ్ చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వ స్థలాలు ఖాళీ చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని నక్కా ఆనంద బాబు హెచ్చరించారు.

Updated Date - 2021-06-15T18:00:02+05:30 IST